తన వ్యూహాలతో నరమేథం సృష్టిస్తూ..ఎంతో మంది యువతను ప్రాణాలు తీసే నరరూప రాక్షసులుగా మార్చి ప్రపంచ నాశనాన్ని కోరుకునే కఠిన హృదయుడు మసూద్ అజార్. గత కొంత కాలంగా భారత్ ని టార్గెట్ చేసుకొని జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఎన్నో ఘాతుకాలకు పాల్పపడ్డారు. ఇటీవల పుల్వామా దాడి కూడా ఈయన సూచనల మేరకే జరిగినట్లు సమాచారం.
అయితే ప్రపంచ దేశాలు మసూద్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు మసూద్ పాకిస్థాన్ లో తలదాచుకున్నారని చెబుతున్నా..అదేం లేదంటూ బుకాయిస్తూ వచ్చింది దాయిది దేశం. తాజాగా జైషే మహ్మద్ చీఫ్ తమ దేశంలోనే ఉన్నాడని అంగీకరించిన పాకిస్థాన్.
ప్రస్తుతం మసూద్ అజార్ ఆరోగ్యం బాగాలేదు. అజార్ ఇంటి నుంచి బయట కాలు పెట్టలేని స్థితిలో ఉన్నాడు. మసూద్ అజార్ ను అప్పగించాలంటే మా న్యాయస్థానాలు ఒప్పుకోవాలి. మసూద్ ని అప్పగించేందుకు తగ్గ ఆధారాలు భారత్ ఇవ్వాలి. మసూద్ కు వ్యతిరేకంగా పాక్ న్యాయస్థానాలు అంగీకరించే సాక్ష్యాలు ఇవ్వాలి. సాక్షాలు ఇస్తే మా న్యాయస్థానాల్ని, ప్రజల్ని ఒప్పిస్తాం అంటున్న పాక్ విదేశాంగ శాఖా మంత్రి ఖురేషీ.