జనాల చెవుల్లో పువ్వులు పెట్టడం లో తండ్రిని మించిన తనయుడు అవుదాము అని అనుకుంటూ ఉన్నాడో ఏమో కానీ నారా లోకేష్ మాత్రం సోషల్ మీడియా వేదిక గా కాస్త హడావిడి ఎక్కువగానే చేస్తున్నాడు.  ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైకాపా   అధినేత జగన్ మోహన్ రెడ్డి డిల్లీ నుంచి గల్లీ వరకూ చంద్రబాబు ఏ రకంగా ఓట్లని తొలగిస్తున్నారు అనేది స్పష్టంగా రుజువులతో సహా చూపిస్తూ ఉంటె లోకేష్ రివర్స్ కహానీలు వినిపిస్తున్నారు .

Image result for ys jagan

" వైకాపా ఓట్ల తొలగింపు లో నిమగ్నం అయ్యి ఉంది " అంటూ కొత్త పల్లవి అందుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్. అసలు అధికార పార్టీ వాళ్ళు ఓట్ల తొలగింపు చేస్తున్నారు మొర్రో అంటూ జగన్ డిల్లీ సాక్షిగా ఎలక్షన్ కమీషన్ కి కంప్లైంట్ చేసిన తరుణం లో లోకేష్ ఇలా మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రీసెంట్ గా లోకేష్ మాట్లాడుతూ పదివేల ఓట్ల వరకూ జగన్ సమక్షం లో తొలగించారు అనీ ఇది వైకాపా - బీజేపీ కలిసి చేసిన కుట్ర అన్నట్టుగా మాట్లాడారు ఆయన.

Image result for lokesh

ఈ వ్యాఖ్యల మీద సోషల్ మీడియా జనాలతో పాటు సామాన్యులు కూడా మండి పడుతున్నారు. అధికార పార్టీ చేస్తోన్న దారుణాలు గాలికి వదిలేసి , ఓట్ల తొలగింపు లో తమ తప్పు లేదు అని ఇప్పటి వరకూ రుజువులు చూపించకుండా ఇప్పుడు జగన్ మీద పడ్డం ఏంటి అంటూ జగన్ అధికారపక్షాన్ని దులిపెస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: