ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ అయినటువంటి టీడీపీ నుంచి వైసీపీ లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు, ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జగన్ సమక్షం లో పార్టీ ఖండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టీడీపీకి జలక్ వస్తే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే పార్టీ కి రాజీనామా చేశాడు. తెలుగుదేశం పార్టీని వీడటం ఖాయమని అనుకున్న.. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ లాంఛనాన్ని పూర్తి చేశారు.

Image result for modugula venugopal reddy

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరు వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదుగుల ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధమైనట్టే అనుకోవాలి. మోదుగుల తెలుగుదేశం పార్టీని వీడతారనే ఊహాగానాలు చాన్నాళ్ల నుంచినే ఉన్నాయి. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. 

Image result for modugula venugopal reddy

గుంటూరు లోక్ సభ సీటు పరిధిలోని అసెంబ్లీ సీట్లకు జరిగిన రివ్యూ మీటింగ్ కు కూడా మోదుగుల హాజరు కాలేదు. మోదుగుల టీడీపీని వీడినట్టేనని.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోదుగుల రాజీనామాతో లాంఛనాన్ని పూర్తి చేశారు. అతి త్వరలోనే మోదుగుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను కలిసి, ఆ పార్టీలోకి చేరబోతున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: