హైదరాబాద్: తెలంగాణలోని పరకాలలో జరిగిన ఉప ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఇక్కడ వైఎస్ఆర్-టీఆర్ఎస్ పార్టీల మధ్యన గట్టి పోటీ జరిగింది. అయితే, మొదటి రౌండ్ లెక్కించే వరకు టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి పన్నెండు వందల పై చిలుకు ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నాడు. ఇక్కడ మొదటి నుంచీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనీ సర్వేలు చెప్పాయి. అందరూ ఇదే భావించారు. అందరి అంచనాల ప్రకారమే మొదటి రౌండ్ నుంచే టీఆర్ఎస్ అభ్యర్థి తన ఆధిక్యతను చాటుతున్నాడు. ఇక మిగతా స్థానాల గురించి చూస్తే 14అసెంబ్లీ స్థానాలలో ఫ్యాన్ గాలి వీస్తోంది. కాంగ్రెస్ రెండు స్థానాలలో ఆధిక్యతలో ఉంది. టీడీపీ ఎక్కడా కూడా ఆధిక్యత చాటడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: