తెలుగుదేశం అధినేత చంద్రబాబుని ఒకనాటి సహచరులే దారుణంగా విమర్శిస్తున్నారు. బాబు పక్కన కూర్చున్న వారే ఆయన తప్పులను ఎత్తి చూపిస్తున్నారు. చంద్రబాబు వైఫల్యాలను, ఆయన లోపాలను బాగా తెలిసిన వారే బయటకు వచ్చి హాట్ కామెంట్స్ చేస్తూంటే తట్టుకోవడం బాబు గారికి కష్టమే మరి.


మల్టీ టంగ్ :


చంద్రబాబుకి డబుల్ టంగ్ కాదు.. మల్టీ టంగ్ అన్నారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. ఈ రోజు హైదరాబాద్లోలో వైఎస్ జగన్ ఆద్వర్యంలో వైసీపీలో చేరిన దాది వీరభద్రరావు మీడియాతో మాట్లాడారు. బాబు రోజుకొక మాట మాట్లాడుతారని, ఆయనకు నిలకడ లేనే లేదని అన్నారు. ఆయన పరిపాలన కూడా గాడి తప్పిందని విమర్శించారు. తనలో ఎన్నో లోపాలు పెట్టుకుని ఇతరులపై దుమ్మెత్తిపోయడం బాబుకు అలవాటేనని దాడి అన్నారు.


వచ్చేది జగన్ సర్కార్ :


ఇదిలా ఉండగా ఏపీలో రానున్నది జగన్ ప్రభుత్వమని దాడి జోస్యం చెప్పారు. జగన్ లా సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన వారు ఎవరూ లేరని దాడి అన్నారు. అన్ని రంగాలను భ్ర‌ష్టు పట్టించి ఏపీకి కుక్కలు పింపిన విస్తరి చేసిన బాబు పాలన పోవాలాని ఆయన  అన్నారు. ఏపీలో జగన్ రావడం ఇపుడు చారిత్రాత్మక అవసరమని దాడి చెప్పారు. దాడితో పాటు ఆయన కుమారుడు రత్నాకర్ కూడా వైసీపీలో చేరారు. మొత్తానికి దాడి చేరికతో ఏపీలో వలసలు వైసీపీ వైపేనని గట్టిగా చెప్పినట్లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: