వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేడు ఎంతో ప్రత్యేకమైన రోజని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.  దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ నేటితో ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానేతగా ఎదిగారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ జనాల మద్దతు కూడగట్టుకున్నారు.
Image result for ysrcp
ప్రజా సంకల్పయాత్రలో జగన్ వెళ్లిన ప్రతిచోట మళ్లీ రాజన్న వచ్చారని ప్రజలు అక్కన జేర్చుకున్నారు.  ఎండా..వానా..చలి అనే తేడా లేకుండా సామాన్య ప్రజల కోసం సామాన్యుడిగా జగన్ పాద యాత్ర చేయడంపై ప్రజలు అయన దీక్షకు ఆనందం వ్యక్తం చేశారు.  ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోని పార్టీ కార్యకర్తలు వేడుకలు చేసుకుంటున్నారు.  మహానేత ఆశయాలను, పథకాలను సజీవంగా ఉంచేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. 
Image result for ysrcp
 "మహానేత ఆశయాలను, పధకాలను సజీవంగా ఉంచేందుకు  వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. గత ఎనిమిదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాలమీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు, వందనాలు" అంటూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరుపుకునేందుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: