తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కెసిఆర్ ఆ సమయంలో జరిగిన మీడియా సమావేశంలో అనవసరంగా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి రెచ్చగొట్టిన చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటీవల డేటా లీకేజ్ కేసు విషయమై కెసిఆర్ గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు రకరకాలుగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎపి తెలుగుదేశం నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్శించడం ద్వారా లబద్ది పొదాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎపి టిడిపి అద్యక్షుడు కళా వెంకటరావు ఒక బహిరంగ లేఖ రాస్తూ కెసిఆర్ పై విమర్శలు చేశారు.
చంద్రబాబు ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తుంటే, కెసిఆర్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కు మాస్టర్ ప్లాన్ ఇస్తున్నారని ఆయన అన్నారు. ఆధార్ నెంబర్లు తీసుకున్నారని ఆరోపిస్తున్న వారు.. ఆ నంబర్లతో ఏం చేయగలరో చెప్పాలని డిమాండ్ చేశారు.
తన ఆధార్ నెంబర్ ఇస్తా.. ఏం చేస్తారో చెప్పండి అంటూ కళా ప్రశ్నించారు. హైదరాబాద్లో వ్యాపారాలు వున్న తెదేపా నేతలు వైకాపాలో చేరడం వెనుక తెరాస బెదిరింపులు లేవా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ కు కెసిఆర్ రెండువేల కోట్లు ఇచ్చారని కూడా ఆయన అంటున్నారు.మరోపక్క చంద్రబాబు వెయ్యి కోట్లు అని అంటే ఈయన మరో వెయ్యి కోట్లు పెంచారు.