దర్శి టీడీపీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు రచ్చ రచ్చ చేస్తున్నారు. సిద్దా పార్లమెంటు కి వెళుతున్నారు అనే మాట వినపడడం తో కార్యకర్తలు గొడవకి దిగారు. ఒంగోలు టీడీపీ అభ్యర్ధి గా అధిష్టానం సిద్దా పేరు విన్పించే అవకాశం ఉంది అని తెలియడం తో ఆందోళన జరుగుతోంది. సిద్దా నే ఉండాలి లేదంటే వేరే వాళ్ళని ఓడిస్తాం అంటూ పట్టు పడుతున్నారు వాళ్ళంతా. ఒకవేళ సిద్దా తప్పని సరి పరిస్థితి లో గనక ఎంపీ గా వెళ్ళాల్సి వస్తే తన కొడుకు సిద్దా సుదీర్ ని ఎమ్మెల్యే గా తన నియోజికవర్గం లో నిలబెట్టాలి అని కోరుతున్నారు కార్యకర్తలు. దర్శి అసంబ్లీ నుంచే తాను పోటీ చేస్తాను అని రాఘవరావు క్లియర్ గా చెప్పినా కూడా వినకుండా అధిష్టానం ఎంపీ గా పోటీ చెయ్యమని కోరుతోంది. మరొక పక్క ఉగ్ర కి దర్శి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉండడం తో అధిష్టానం సిద్దా ని ఒంగోలు కి పంపించే ఆలోచన తో ఉంది సో గొడవ  చేస్తున్నారు కార్యకర్తలు . సిద్దా ఎంత చెప్పినా గానీ వినడం లేదు కార్యకర్తలు అని తెలుస్తోంది. తమ డిమాండ్ ఒప్పుకోకపోతే గనక ఖచ్చితంగా ధర్నా లు రాస్తా రోకోలు చేస్తాం అని వారు వార్నింగ్ ఇస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: