టిడిపి అధినేత చంద్రబాబు మరొక సారి ఎలాగైనా చేతిలో ఉన్న అధికారం కోల్పోకుండా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటికే తన పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు రానున్న కొద్ది రోజుల్లోనే పార్టీ సంస్థాగత వ్యవహారాల పై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Related image

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి గతంలో కంటే మెరుగైన ఫలితాలు సర్వేల్లో వస్తున్న నేపథ్యంలో ఇదే జోరు కొనసాగించాలని చంద్రబాబు పార్టీలో ఇన్‌చార్జుల వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించారు.

Image result for CHANDRABABU

కొంత కాలంగా ఎన్నికల్లో ఓడినోయిన అభ్యర్థులు తమ నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. అయితే నియోజకవర్గ కార్యకర్తల పై కొందరు ఇన్‌చార్జులు పెత్తనం కూడా అదే స్థాయిలో చలాయించేవారు.

Related image

వారికి చెక్ పెట్టేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అంటున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు. రాబోతున్న ఎన్నికలలో ఎలాగైనా తెలుగుదేశం పార్టీని మరొకసారి గెలిపించుకుంటామని చంద్రబాబు ని ఎలాగైనా ముఖ్యమంత్రి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా మార్చే వరకు నిద్రపోము అని అంటున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు.



మరింత సమాచారం తెలుసుకోండి: