ఏ రంగంలోనైనా సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. కొందరైతే వాటినే గట్టిగా  నమ్ముకుంటారు. ఆనాడు  అలా జరిగితే లక్కు కలసివచ్చింది అంటూ దాన్నే ఫాలో అవుతారు. చిత్రమేంటంటే కొందరికి ప్రతీ సారీ ఆ సెంటిమెంట్లు అచ్చిరావడమే కాదు వారిని ఉన్నత స్థానాలకు తీసుకుపోతున్నాయి. మరి అలాంటి సెంటిమెంట్ ని ఎవరైనా వదులుకుంటారా


అందుకే విశాఖ జిల్లా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సెంటిమెంట్ ని మళ్ళీ నమ్ముకున్నారు. ఇంతకీ గంటా సెంటిమెంట్ ఏంటనేగా సందేహం. ఆయన ప్రతి ఎన్నికకూ నియోజకవర్గాన్ని మారుస్తారు. అలాగే పార్టీని కూడా మారుస్తారు. అయితే ఈసారి పార్టీని మార్చడం కుదరలేదు. దాంతో ఏకంగా సీటునే మార్చుకున్నారు. నిన్నటి వరకూ సిట్టింగ్ సీటు భీమిలీ నాది అంటూ గట్టిగా చెప్పుకుని తన నేస్తం అవంతి శ్రీనివాసరావు పార్టీని వీడడానికి కారణమైన గంటా  ఇపుడు ఆ సీటును చాలా ఈజీగా  వదిలేసుకున్నారు. 


విశాఖ ఉత్తరం నుంచి ఆయన బరిలోకి దిగిపోతున్నారు. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న ఆ సీట్లో టీడీపీ జెండా ఎగరేయాలన్నది గంటా ఉద్దేశ్యమట. పార్టీ కూడా అయనకు అక్కడే సీటు ఖరార్ చేసింది. రెండు వేల కోట్లతో భీమిలీ అభివ్రుధ్ధి చేశానని చెప్పుకున్న గంటా ఇపుడు ఉత్తరానికి మారడం పెద్ద ట్విస్ట్. మరి చూడాలి సెంటిమెంట్ ఎలా పండుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: