ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల కాలం కావడం తో ఎవరు ఏ మూల ఏ మాట అన్నా అది చాలా కీలకంగా చూస్తోంది మీడియా .



ప్రతీ మాట నీ క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. రీసెంట్ గా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ పార్టీ తరఫున పోటీ చెయ్యడానికి అందరూ భయపడుతూ ఉన్నారు అనీ ఈ  పార్టీ లో పోటీ చాలా ఇబ్బందికరంగా మారింది అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.



ఎవరి కార్యకర్త లేదా చిన్న స్థాయి నేత అలా అన్నాడు అంటే అనుకోవచ్చు. ఎన్నో దశాబ్దాలు గా టీడీపీ తో సాగుతున్న జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అందరూ షాక్ కి గురి అవుతున్నారు. పొలిటికల్ వేడి రాజుకున్న వేళలో జేసీ వ్యాఖ్యలకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వార్త విన్న ప్రత్యర్ధులు జేసీ చెప్పిన దాని బట్టి చూస్తుంటే టీడీపీ పని ఐపోయినట్టేనా అని వాపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: