వైసీపీ జాబితా కోసం ఏపీ అంతా వెయిటింగ్. ఓ వైపు ఆ పార్టీ గాలి బలంగా వీస్తూంటే ఇప్పటివరకూ అభ్యర్ధుల జాబితా మాత్రం ఎక్కడా  బయటకు రాలేదు. చాలా చోట్ల అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఇంకా ఆశ మీద ఉన్న వారు ఎవరు ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. దాంతో అఫీషియల్ లిస్ట్ కోసం అంతా వేయి కళ్ళతో వేచి ఉన్నారు.


విశాఖలో వైఎస్ జగన్ రేపు వైసెపీ తొలి జాబితా విడుదల చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలియచేశాయి.టోటల్ గా  150 మంది అభ్యర్ధులతో వైసీపీ తొలి జాబితా విడుదల అవుతుంది. ఇందులో ఒక్క విశాఖ నుంచి 12 మంది అభ్యర్హ్దులు ఉంటారని టాక్. అంటే కేవలం మూదు  చోట్ల మాత్రమే పెండింగ్ ఉంటుంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం మొత్తం అభ్యర్ధుల లిస్ట్ రిలీజ్ ఉంటుందని అంటున్నారు.


విశాఖ నుంచి మళ్ళ విజయప్రసాద్ (నార్త్), వంశీక్రిష్ణ (తూర్పు), అదీప్ రాజ్ (పెందుర్తి), గుడివాడ అమర్నాధ్ ( అనకాపల్లి), గొల్ల బాబూరావు (పాయకరావుపేట), కన్నబాబురాజు (ఎలమంచిలి) కరణం ధర్మశ్రీ (చోడవరం), అవంతి శ్రీనివాస్ (భీమిలి), బూడి ముత్యాలనాయుడు ( మాడుగుల), ఉమా శంకర్ గణేష్ ( నర్శీపట్నం),  తిప్పల నాగిరెడ్డి (గాజువాక) తొలి లిస్ట్ లో ఉంటారని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: