మామూలుగానే నెల్లూరులో టీడీపీ పార్టీ చాలా వీక్ గా ఉంది. 2014 లో ఈ జిల్లా నుంచి టీడీపీ కి పది అసెంబ్లీ స్థానాలకు గాను మూడంటే మూడే స్థానాలను కైవసం చేసుకున్నది. అయితే ఇప్పుడు పరిస్థితి మొత్తం ఘోరంగా తయారైంది. టీడీపీ పార్టీ నుంచి నాయకులూ ఇప్పుడు వైసీపీలోకి జంప్ అవుతుండటంతో ఆ పార్టీ పరిస్థితి ఎటుకాకుండా తయారవుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నట్టుండి ఉండి టీడీపీ కి హ్యాండ్ ఇవ్వటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. 

Image result for tdp

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు మళ్లీ సీటు ఇచ్చింది టీడీపీ. కానీ ఆయనకు టీడీపీ నుంచి పోటీ చేయండ ఇష్టం లేదు. ఎందుకంటే పోయినసారే గెలవనప్పుడు ఇప్పుడు ఎలా గెలుస్తాం అనేది ఆయన పాయింట్. అయినా కూడా అయిష్టంగానే ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఈ లోగా సడన్ గా ఆయన ఫోన్ కి ఒక మేసేజ్ వచ్చింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంట్రాక్టు పనుల తాలూకు డబ్బులు రూ.43 కోట్లు ఆయన ఎక్కౌంట్ లో పడ్డాయి . అంతే ఆయన ఎన్నికల ప్రచారం నుంచి సడన్ గా మాయమైపోయారు. ఫోన్ కూడ స్విచ్చాఫ్ చేసుకున్నారు.


ఎంక్వైరీ చేస్తే.. డైరెక్ట్ గా వచ్చి లోటస్ పాండ్ లో తేలారు. జగన్ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో.. టీడీపీ టిక్కెట్ ని కూడా కాదనుకుని వైసీపీలో చేరిపోయారు ఆయన. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా… వైసీపీ నుంచి టిక్కెట్ దొరికిందా లేదా అనేదే పాయింట్ అంటున్నారు ఆదాల ప్రభాకరరెడ్డి. ఇంకా చెప్పాలంటే జంపింగ్ జపాంగ్ లో కొత్త ఒరవడి సృష్టించారు ఆయన. 

మరింత సమాచారం తెలుసుకోండి: