2014 ఎన్నికల్లో అధికారం కోసం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై మరియు టిడిపి నాయకుల పై సంచలన కామెంట్ చేశారు వైసీపీ అధినేత జగన్. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని తన స్వార్ధ రాజకీయాలకోసం ఆంధ్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని..

Related image

విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలో చంద్రబాబు తీవ్రంగా ఆంధ్ర ప్రజలను మోసం చేశారని వైసీపీ అధినేత జగన్ టీడీపీ పార్టీపై మరియు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు.

Related image

త్వరలో రాబోతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కి రోజులు దగ్గర పడ్డాయని ముందే తెలుసుకున్న చంద్రబాబు రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్రంలో టిడిపి రాబోతున్న ఎన్నికల ఓడిపోతుందని తెలుసుకున్న చంద్రబాబు ముందు ఓట్లను తొలగించారని తరువాత రాష్ట్రంలో వైసీపీ పార్టీ కి బలంగా ఉన్న మనుషులను భూమ్మీద లేకుండా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారని...

Image result for ys jagan meetings

ఇందులో భాగంగానే బాబాయ్ వివేకానంద రెడ్డిని పోగొట్టుకున్నానని...కానీ నాన్న నాకిచ్చిన ఈ రాష్ట్ర కుటుంబం కోసం నిరంతరం చివరి రక్తపు బొట్టు వరకు రాక్షసులతో పోరాడతానని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతానని జగన్ ఇటీవల పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: