వైసీపీ పార్టీ అధినేత జగన్ పాల్గొంటున్న ఎన్నికల ప్రచారంలో జనం తండోపతండాలుగా వస్తున్నారు... వైసీపీ పార్టీ కి బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సర్వేలలో ఇప్పటి వరకు ప్రతి సర్వేలలో వైసీపీ పార్టీ అధికారం లోకి వస్తుందని జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీ క్యాడర్ ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రి అయిపోయారని కేవలం ఎన్నికల మాత్రమే ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.

Image result for jagan

ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ కి రాజధాని పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు కూడా జగన్ నీ అక్కున చేర్చుకుంటున్నారు. దేశం మొత్తం ప్రపంచం మొత్తం చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుందని గతంలో కల్లబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు.... మాటలు మాత్రమే చెప్పారని చేతల్లో ఏమీ లేదని రాజధాని పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు జగన్ సభలకు వచ్చిన సామాన్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Related image

అయితే ప్రస్తుతం ఆంధ్రాలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే ఆంధ్ర రాజధాని ప్రాంతంలో కూడా జగన్ కి జనాలు నీరాజనాలు పడుతుండటంతో ప్రత్యర్థి పార్టీల నాయకులకు వెన్నులో వణుకు పడుతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినబడుతున్నాయి.

Image result for jagan

మొత్తంమీద రాయలసీమ ప్రాంతంలో స్పష్టమైన హవా కొనసాగిస్తున్న జగన్ నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో కూడా అదే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైసీపీ కేడర్ ఎంతగానో సంతోషంలో మునిగి తేలుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: