ఎన్నికలు సమీపిస్తున్న వేళ సినీ హంగులు కూడా తళుక్కుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా సినీ గ్లామర్ ఎక్కువగా ఉన్న టీడీపీ, జనసేనను కాదని వైసీపీ బాట పడుతున్నారు నటీనటులు. సినీ రంగం నుంచి వచ్చిన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా.. ఇప్పటికీ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆక్టివ్గా ఉంటూనే వైసీపీ తరుపున ఫైర్బ్రాండ్గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే రాజశేఖర్ జీవితా దంపతులు వైసీపీలో ఉన్నారు. మరోవైపు సీనియర్ నటి జయసుధ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఆలీ.. ఇక తనీష్, వినాయకుడు ఫేమ్ కృష్ణుడు, రాజా రవీంద్ర, పీవీపీ వంటి నటులు, నిర్మాతలు వైసీపీలో చేరి ఆయ పార్టీల తరుపున ప్రచారం నిర్వహించడానికి రంగంలోకి దిగారు.
తాజాగా ఈ లిస్టులో ఇటీవల జరిగిన ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్’ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన శివాజీ రాజా కూడా ఉన్నాడు. జగన్ సమక్షంలో శివాజీ రాజా వైసీపీలో చేరాడు. మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల సందర్భంగా నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు శివాజీరాజా. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తరుపున నర్సాపురం పార్లమెంట్ నుంచి బరిలోకి దిగిన నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీరాజా ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. ఇదే నాగబాబుకు శివాజీ రాజా ఇచ్చే గిప్ట్ అని అందరు చెప్పుకుంటున్నారు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో వైసీపీ నిండా సినిమా వాళ్లే కనిపిస్తున్నారు. మొత్తానికి హీటెక్కిన ఈ ఎన్నికల సమయంలో అంతే హీటెక్కించే సినీరాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.