చంద్రబాబునాయుడు పుత్రరత్నం నారా లోకేష్ ప్రసంగాలు  ఓ రేంజిలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అలాంటిదే తాజాగా మరో ఆణిముత్యాన్ని జనాల్లోకి వదిలారు లోకేష్ .  తెలుగురాష్ట్రాల్లో పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మంగళగిరిలో ప్రచారం చేస్తున్న నారా లోకేష్ మాత్రం ఏప్రిల్ 9వ తేదీ పోలింగ్ లో తనకు ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించాలంటూ అభ్యర్ధిస్తున్నారు ఓటర్లను.

 

తానేం మాట్లాడుతున్నాడా లోకేష్ కు తెలియటం లేదు. ఏదో మాట్లాడుదామని అనుకుని ఇంకేదో మాట్లేడుస్తున్నాడు. ఎప్పుడు లోకేష్ ఏం మాట్లాడినా అంతా చెత్తే అవుతోంది. మరి భాష మీదే పట్టులేదో లేకపోతే విషయపరిజ్ఞానం లేకుండానే మాట్లాడుతున్నాడో కూడా అర్ధం కావటం లేదు.

 

ఐదురోజులుగా మంగళగిరిలోనే క్యాంపు వేసిన లోకేష్ మాటల్లో ఎన్ని తప్పులు దొర్లుతున్నా సరిదిద్దుకుందామన్న ఆలోచన కూడా ఉన్నట్లు లేదు. పైగా పక్కనున్న వాళ్ళు  ఎవరూ సరిదిద్దే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు లేదు. లోకేష్ మాట్లాడుతున్నది తప్పని చెబితే మళ్ళీ ఏం సమస్య వస్తుందో అన్న భయంతో ఎవరికి వారుగా మాట్లాడకుండడా కూర్చుంటున్నారు. దాంతో లోకేష్ ప్రసంగాల్లో తప్పులు అలా నిరాఘాటంగా దొర్లుతునే ఉన్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: