తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతన వర్గానికే ఎక్కువ మేలు చేసుకుంటారని..మిగతా వారిని అసలు పట్టించుకోరని..కేవలం వాడుకోవడం తప్ప మిగతా వర్గాల గురించి బాబు గారు ఎప్పుడు ఆలోచించారని రాజకీయాలలో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని..చంద్రబాబు సామాజికవర్గానికే మొదటి పీట వేస్తున్నారు అంటూ ఇటీవల టీడీపీ నుండి వైసీపీ పార్టీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మల్యే కాండ్రు కమల అన్నారు.
అధికారం నిలబెట్టుకోవడానికి చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెబుతున్నారని, గుంటూరు జిల్లాలో తన సామాజిక వర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారని తెలిపారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ తరపున ముగ్గురు మహిళలకు వైఎస్ జగన్ సీట్లు ఇచ్చారని, సామాజిక సమత్యులత పాటించారని వెల్లడించారు. వైఎస్ జగన్కు ఒక్కసారి అవకాశం ఇస్తే రాజన్న పరిపాలన మళ్లీ చూస్తామన్న నమ్మకం తమకు ఉందని ఆమె అన్నారు.
మంగళగిరి స్థానాన్ని బీసీలకు కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని కాండ్రు కమల విమర్శించారు. నాయకులను కానీ ప్రజలను కానీ నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుకు మించిన వారు లేరని ఇందు మూలంగానే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు కమల.
ఇంత దారుణమైన నీచమైన రాజకీయాలు చేసే చంద్రబాబుకి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు రాబోయే ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయం అని బీసీలు మొత్తం అప్రమత్తంగా ఉండాలని కాండ్రు కమల సూచించారు.