ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రామాల రాజకీయం జరుగుతుందని పులివెందులలో జరిగిన మహాసభలో జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోరాబోయే ఎన్నికలలో ఓడిపోతాడని ముందే తెలిసిన చంద్రబాబు హత్యారాజకీయాలకు తెరలేపారని ఇదే క్రమంలో తన ఎప్పటి పార్ట్నర్ యాక్టర్ తో చేతులు కలిపారని ఆ యాక్టర్ పార్టీకి మరియు అభ్యర్థులకు చంద్రబాబే డబ్బులు పంచుతున్నారని కుట్రకు తెరలేపారన్నారు.

Image result for ys jagan at pulivendula meeting

ప్రస్తుతం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓట్లను చీల్చడానికి ఆ యాక్టర్ తో గత ఎన్నికల మాదిరిగానే చేతులు కలిపారని ఇద్దరూ గత ఎన్నికల మాదిరిగానే ప్రజలను మోసం చేయడానికి రంగంలోకి దిగారని...ఇదే క్రమంలో హత్య రాజకీయాలకు కూడా పాల్పడి ఎన్నికలను ఆపేయాలని ప్రభుత్వం చూస్తోందని..జగన్ ఆరోపించారు. అంతేకాకుండా వైసీపీ పార్టీకి చెందిన నాయకుల పై దాడులకు పాల్పడి ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని ఇటీవల తన అనుచరులకు చంద్రబాబు ఆదేశించారని జగన్ అన్నారు.

Image result for chandrababu pawan kalyan

ఇదే క్రమంలో చంద్రబాబుకి మద్దతు తెలిపే యాక్టర్ కూడా జగన్ ఫ్యాక్షన్ లీడర్ అంటూ కొత్త రాగం ఎత్తడం తో రాష్ట్రంలో గొడవలు జరుగుతాయని పేర్కొనడంతో జగన్ చెప్పిన మాటల్లో నిజం ఉంది అని కుమ్మక్కు రాజకీయాలు చేసే వారికి తగిన విధంగా రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని వైసీపీ పార్టీ కి చెందిన కొంతమంది నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద రాబోయే ఎన్నికలలో అధికారం కోసం చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు లో పార్ట్నర్ పాత్ర చాలానే ఉందనే జగన్ కామెంట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: