ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని గత ఎన్నికలలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాబోతున్న ఎన్నికలలో ఓడిపోతారని తెలిసి చీకటి ఒప్పంద రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ పార్టీ నాయకుడు సి రామచంద్రయ్య పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజల ముందు విడిపోయినట్టు నటిస్తూ చీకటిలో చంద్రబాబు- పవన్ కళ్యాణ్ లు కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

Image result for c ramachandraiah

స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానంటూ అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ కళ్యాణ్ ప్రజల ముందు చెబుతూ...తెర వెనుక ప్రజలను మోసం చేస్తున్న నాయకులకు భుజం కాస్తున్నారని...ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మరియు అభిమానాన్ని ప్యాకేజీకి అమ్మేసుకున్నారు అని పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు సి రామచంద్రయ్య.

Image result for pawan chandrababu '

ఎన్ని కుయుక్తులు ఎన్ని కుట్రలు మరియు పనికి మాలిన రాజకీయాలు చేసిన సామాన్య ప్రజలకు ఇద్దరు చేస్తున్న పార్ట్నర్ రాజకీయాలు తెలిసి పోయాయని...రాబోతున్న ఎన్నికలలో ఈసారి మోసపోకుండా ప్రజలు గట్టిగా వాళ్ల ఓటు ద్వారా బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని సి రామచంద్రయ్య పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని తన స్వార్ధ రాజకీయాలకోసం అన్ని విధాల మోసం చేసిన చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు అంటూ తీవ్ర విమర్శల వర్షం కురిపించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: