గుడివాడ వైసీపీ పార్టీ కి చెందిన నాయకుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్న కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని రాబోతున్న ఎన్నికలలో దారుణంగా ఓడిస్తానని ఇటీవల పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని చాలా ధీమాగా చెప్పారు.

Image result for kodali nani

గుడివాడ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ...ఈ ప్రాంత ప్రజలు నన్ను చిన్ననాటి నుండి చూస్తున్నారని నా ఇల్లు తెలుసు అని నా ఫోన్ నెంబర్ కూడా తెలుసని అంటూ...ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే కాపు సోదరులు నన్ను ఎంతగానో ఆదరించారు అని...ప్రజల కోసం నీతి, నిజాయతీగా పోరాటం చేసిన వ్యక్తి రంగా అని వ్యాఖ్యానించారు. అందుకే తన కులాన్ని కాదని రంగా వైపు నిలబడ్డానని అన్నారు.

Image result for kodali nani

ఈరోజు వైసీపీ అధినేత జగన్ నీతిగా, నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని చెప్పారు. అందుకే తన కులస్తుడైన చంద్రబాబును కాదని జగన్ కు మద్దతుగా నిలబడ్డానని వ్యాఖ్యానించారు. రాబోతున్న ఎన్నికలలో మళ్లీ కనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచకాలు నెలకొంటాయని...ఈసారి జగన్ ని ఉంచుతాడో, ఉంచడో తనకు తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: