ఆంధ్రుల ఆస్తులపై తెలంగాణాలో దాడులు జరుగుతున్నాయి...

హైదరాబాద్ లోని సీమాంధ్రులకు చెందిన రాజకీయ నేతలను కెసియార్ అండ్ కో బెదిరిస్తున్నారు...

కెసియార్ అండ్ కో బెదిరింపుల వల్లే పలువురు టిడిపి, జనసేన నేతలు వైసిపిలో చేరుతున్నారు... 

 

ఇవి తెల్లవారి లేస్తే చంద్రబాబునాయుడు, పార్టనర్ పవన్ కల్యాణ్ చంద్రబాబుకు మద్దతిచ్చే  మీడియా కెసియార్ అండ్ కో పై  చేస్తున్న ఆరోపణలు. తాజాగా  అవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. ఎలాగంటే, హెరిటేజ్ వ్యాపారాన్ని విస్తరించారు. ఐస్ క్రీం ఉత్పత్తులను మరింతగా పెంచుకునేందుకు ఉప్పల్ లో ఓ భారీ ప్లాంట్ పెట్టారు.  అంటే ఇప్పటి వరకూ పాలు, పాల ఉత్పత్తులతో పాటు ఇతర నిత్యావసరాలను మాత్రమే హెరిటేజ్ కంపెనీ అమ్ముతుండేది.  ఐస్ క్రీం ఉత్పత్తులు తక్కువగానే ఉండేది.

 

కొత్తగా భారీ ఐస్ క్రీం ప్లాంట్ ఏర్పాటు వల్ల మరిన్ని ఉత్పత్తులను తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ ఉత్పత్తులను కూడా ముందుగా హైదరాబాద్ లో ఔట్ లెట్లకు పరిచయటం చేస్తారు. హైదరాబాద్ ఔట్ లెట్లకు వచ్చే స్పందన చూసి తర్వాత మిగితా ప్రాంతాలకు కూడా విస్తరించబోతున్నారు. ఆ ప్లాంట్ ప్రారంభోత్సవానికే చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి పూజలు చేసి ప్రారంభించారు.

 

హైదరాబాద్ లోని సీమాంధ్రులను కొడుతున్నదే నిజమైతే, పారిశ్రామికవేత్తలను, వ్యాపారస్తులను బెదిరిస్తున్నదే వాస్తవమైతే మరి సాక్ష్యాత్తు చంద్రబాబు హెరిటేజ్ కంపెనీని కోడలు ఎలా విస్తరించగలరు ? అసలు హెరిటేజ్ కార్పొరేట్ కార్యాలయాన్ని అమరావతికి తరలించకుండా ఇంకా ఎందుకు హైదరాబాద్ లోనే ఉంచినట్లు ? హెరిటేజ్ విస్తరణ చూసిన తర్వాత కూడా చంద్రబాబు, పవన్ , చంద్రబాబు మీడియా చేస్తున్న ఆరోపణలు వాస్తవాలేనంటారా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: