వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య రాయలసీమ జిల్లాలో మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో కేసు ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది.

Related image

అయితే ఇటీవల వివేకానంద రెడ్డి కూతురు సునీత చంద్రబాబు ప్రభుత్వం తన ఇంటి మనుషులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో దోషిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ స్వార్థం కోసం తన తండ్రి హత్యను వాడుతున్నారంటూ ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు ప్రభుత్వం పై మరియు రాష్ట్ర విచారణ సిట్ పై అనేక ఆరోపణలు గుప్పించారు.

Image result for vivekananda reddy daughter

ఇదిలావుండగా తాజాగా ఈ కేసు విషయమై రాష్ట్ర ప్రభుత్వం పురోగతి సాధించినట్లు వార్తలు వినబడుతున్నాయి. త్వరలోనే కేసు విషయమై మొత్తం పురోగతి సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క వివేకానంద రెడ్డి కూతురు సునీత తన తండ్రి హత్య విషయంలో కేంద్ర విచారణ దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు చేయించే పనిలో ప్రయత్నాలు జరుపుతూ మరోపక్క న్యాయస్థానాలను  ఆశ్రయిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: