ఎలక్షన్ టైం కావడం తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పొలిటికల్ గా ముందుకి వెళ్ళడానికి అన్ని దారులూ ఆగిపోవడం తో ఫామిలీ ని, వంసాన్నీ రంగంలోకి దింపారు అనిపిస్తోంది.


ప్రస్తుతానికి నందమూరి ఫామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం టీడీపీ కి సపోర్ట్ గా కనపడ్డం లేదు. సరిగ్గా పదేళ్ళ క్రితం ఎన్టీఆర్ ఇదే టీడీపీ తరఫున విపరీతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే .. ఈ క్రమం లో జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు టీడీపీ లో సపోర్తర్ లు ఉన్నారు కానీ అతను మాత్రం స్తబ్దు గా ఉన్నాడు. పైగా ఆయన మావయ్య కూడా వైకాపా లో జేరిపోవడం టీడీపీ కి ఊహించని షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం దిక్కుతోచని స్థితి లో నారా రోహిత్ ని రంగం లోకి దించారు బాబు గారు.


అట్టర్ ప్లాప్ హీరోగా , స్టార్ ఇమేజ్ అంటే ఏంటో కూడా తెలీని నారా రోహిత్ ఇప్పుడు టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. బాబుగారిని ఆదుకోవడం కోసం వచ్చాడు ఆయన అబ్బాయి అంటూ ఎద్దేవా చేస్తున్నాయి వైకాపా శ్రేణులు.


ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకున్న వేళలో ఏ పార్టీ కూడా చెయ్యనన్ని గెలుపు ప్రయత్నాలు మొదలు పెట్టింది టీడీపీ. దాంట్లో భాగంగా అనేకమంది ని రంగంలోకి దించుతోంది. బాలకృష్ణ తన నియోజికవర్గ ప్రచారం లో బిజీ గా ఉండగా చంద్రబాబు పాలన భేష్ అని చెప్పడం కోసం నారా రోహిత్ రంగంలోకి దిగారు. ఈ పరిస్థితి లో బాబు గారికి ఇంకెవరూ దొరకలేదా అంటూ జనం నవ్వుతున్నారు.


" మా కుటుంబం పేరు నిలబెట్టడానికి చంద్రబాబు గారు ఒక్కరు చాలు "అంటూ నారా రోహిత్ చెబుతూ ఉండడం చూసి స్క్రిప్ట్ మార్చమని అంటున్నారు లోకల్ జనాలు 


మరింత సమాచారం తెలుసుకోండి: