ఇటీవల అమరావతిలో వైసీపీ పార్టీ అధినేత జగన్ చెల్లెలు వైయస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించి తెలుగు దేశం ప్రభుత్వంపై మరియు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అదేవిధంగా కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన వైఖరి గురించి అనేక సంచలన కామెంట్లు చేశారు. ఇదే సమయంలో షర్మిల మాట్లాడుతూ వైసీపీ పార్టీ తరఫున ప్రచారం లో పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్లు దానికి షెడ్యూల్ రెడీ అవుతున్నట్లు సమావేశంలో విలేకరులకు తెలియజేశారు.


ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాబోతున్న ఎన్నికలలో కూడా గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఒక పక్క రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని..టిడిపి నాయకులు జగన్ పై చేస్తున్న ఆరోపణలన్ని అబద్ధాలు అని ఆంధ్ర ప్రజలు నమ్మడం లేదని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో..ఎన్నికల ప్రచారంలో కొత్త వ్యూహాలు పన్నుతున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు. ఈ క్రమంలో చంద్రబాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర దేవి ని రంగంలోకి దింపి రాబోతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా ప్రజల మధ్య ఓట్లను అడగటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.


హిందూపురం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మరొకసారి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన భార్య వసుంధర దేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉన్నట్లు వస్తున్న వార్తలు విన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు..మరియు నందమూరి అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. మరోపక్క ఎన్నికలకు ఇంకా కొద్దిరోజులే ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది.




మరింత సమాచారం తెలుసుకోండి: