వైస్సార్సీపీ తరుపున ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మాగుంట టీడీపీ నుంచి  వెళ్లిపోకుండా శతవిధాలా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఏకంగా రెండు జిల్లాల (నెల్లూరు, ప్రకాశం ) నుంచి పోటీ చేయమని బంపర్ ఆఫర్ ప్రకటించిన మాగుంట చివరికి జగన్ కే ఓటేశాడు. దీనితో ఒంగోలు లో వార్ వన్ సైడ్ అయిపొయింది. అయితే మాగుంట ఆర్ధికంగా బలమైన నేత. 


అయితే ఇప్పుడు మాగుంట కు మాల్యా భాకీ పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అవును బ్యాంకులకు మాత్రమే కాదు.. మాగుంటకు విజయ్ మాల్యా డబ్బు ఇవ్వకుండా ఎగనామం పెట్టారట.. నామినేషన్ పత్రాలతో పాటూ సమర్పించిన అఫిడవిట్‌లో.. మాల్యా తనకు రూ.16 లక్షలు బాకీ డబ్బు రావాల్సి ఉందని ప్రస్తావించారు. మాల్యా మాత్రమే కాదు.. విట్టల్ మాల్యా నుంచి మరో రూ.3 లక్షలకుపైగా బాకీ ఉన్నట్లు తెలిపారు. 


మాగుంట నామినేషన్ పత్రాల్లో విజయ్ మాల్యా నుంచి బాకీ డబ్బు రావాలని ప్రస్తావించడంతో.. గతంలో తమకు మాల్యా గ్రూపుతో వ్యాపార సంబంధాలున్నట్లు చెప్పకనే చెప్పారు. మాగుంటకు లిక్కర్ బిజినెస్ ఉంది.. మాల్యా కూడా అదే వ్యాపారం చేశారు. కాబట్టి ఇద్దరికి మధ్య గతంలో పరిచయాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బునే మాల్యా ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఇటీవల మాగుంట టీడీపీని వీడి వైసీపీలో చేరారు. శ్రీనివాసులురెడ్డి జగన్‌తో దిగిన ఫోటోను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌‌ను లండన్‌లో ఉన్న విజయ్ మాల్యా రీ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: