దివంగత మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి యొక్క తల్లి విజయమ్మ తన మరిది అయిన వై ఎస్ వివేకానంద రెడ్డి మరణాంతరం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన చాలా ఘాటుగా స్పందించారు. వై ఎస్ వివేకానంద రెడ్డిని తమ కుటుంబమే చంపింది అన్న విషయాన్ని ఆమె తీవ్రంగా స్పందించారు.

తన భర్త ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రాజా రెడ్డిని చంపితే ఆయన చట్టానికి స్వేచ్ఛను ఇచ్చారే కానీ ఇలా తప్పుడు ఆరోపణలు చేయలేదని ఆమె గుర్తు చేశారు. జగన్ పైన దాడి జరిగిన తీరును కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇలా ప్రతీ దశలోనూ తమ కుటుంబానికి అన్యాయాం జరిగిందే కానీ వారి ఏనాడు ఎవ్వరికీ చిన్న హాని తలపెట్టలేదు ఆమె అన్నారు.

జనాలకు ప్రాణాలు ఇచ్చే కుటుంబం అని ఆమె అన్నారు. అలాగే జగన్ కూడా జనాల మధ్య బ్రతుకుతూ వారికోసమే ప్రాణాలు ఇచ్చే నేతగా ఎదిగాడని, ఇక జగన్ జపం చేస్తున్న చంద్రబాబుకి రానున్న రోజుల్లో ఓటమి ఖాయం అని, మళ్లీ రాజన్న రాజ్యం లోకి అందరం అడుగుపెట్టబోతున్నాం అని ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: