ఎన్నికల ప్రచారంలో జోరు పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతున్న వైసీపీ అధినేత జగన్ తాజాగా రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని మొత్తం అవినీతి మొత్తం ప్రజలకు తెలిసిందని చంద్రబాబుకు అర్థమైందని..ఈ నేపథ్యంలో రాబోతున్న ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి ఇంకా ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారని ప్రజలు నమ్మకూడదు అంటూ మరొకసారి మోసపోవద్దు అంటూ జగన్ పేర్కొన్నారు.


రాబోతున్న ఎన్నికలలో నేను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానని...ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడైతే రాజకీయ నాయకుడు నెరవేర్చ లేదో అదే సమయంలో రాజీనామా చేసే విధంగా వ్యవస్థను మారుస్తానని..నేను ఇచ్చిన హామీలు రాబోతున్న రోజుల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చకపోతే నేనే రాజీనామా చేసి పక్కకు వెళ్లిపోతానని ప్రజల ముందు తెలిపారు జగన్.


ఇంకా జగన్ మాట్లాడుతూ..ఎన్నికలకు ఇంకా రెండు వారాల సమయం ఉంది..కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు చెప్పే అబద్ధం వాగ్దానాలు నమ్మి మరొకసారి మోసపోవద్దని గ్రామాలలో ఉన్న ప్రజలకు కూడా తెలియజేయాలని ప్రతి ఒక్కరు చంద్రబాబు పాలనలో ఏం జరిగిందో గుర్తుపెట్టుకొని తగిన సమయంలో బుద్ధి చెప్పాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: