మంగళగిరి లో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తన అన్న జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికీ అన్యాయం చేయడంటూ, తను రాజన్న బిడ్డ ఎప్పటికీ ఆయనే లాగే ఆదర్శప్రాయంగా పనులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తడంటు వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. మా అన్నయ్య మీద నమ్మకంతో మీ అందరికీ అన్యాయం చేయకుండా మంచే చేస్తాడని నేను రాసి ఇవ్వగలను అని రైతులకు భరోసా ఇచ్చారు షర్మిల. 

అలాగే తాడేపల్లి రైతులతో సమావేశం అయ్యి వారి కష్టాల్ని తెలుసుకున్నారు. తాము పండిచే పంటకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ రైతులు వాపోయారు. అలాగే రాజధాని పేరుతో చంద్రబాబు తమ భూములను లాకున్నారని, ఇప్పుడు యూ జోన్ పేరు తో వేధిస్తున్నారు అంటూ తన గోడును షర్మిలతో వెళ్ళబుచుకున్నరు. షర్మిల మాట్లాడుతూ ఇద్దరి నాయకుల్లో మంచి చెడూ చూసి వారి వ్యక్తిత్వాలు చూసి ఆలోచించి ఓటు వేయాలని ఆమె సూచించారు.అటు నుంచి రోడ్డు షోగా మంగళగిరి కి వెళ్లి అక్కడి ప్రసంగంలో చంద్రబాబును ఏకిపారేసారు.

ఆయన ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తరువాత ఒక మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు. అలాగే తాను గెలవడానికి ఏ పార్టీలతో అయిన సరే మద్దతు కోరుతారు అంటూ ఏద్దేవ చేశారు. మళ్లీ చంద్రబాబు ఓటు వేస్తే రాష్ట్రంలో నియంత పాలన వస్తుందన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: