ఇక తెలుగుదేశం పార్టీ కి రోజులు దగ్గర పడ్డాయని రాబోయేది జగన్ పరిపాలన అని విజయవాడలో విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు మోహన్ బాబు. ప్రజలను అన్ని విధాల మోసం చేసిన చంద్రబాబు కి రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా ప్రజలు బుద్ధి చెబుతారని రాష్ట్రంలో పేద ప్రజలు సామాన్యులు అభివృద్ధి చెందాలన్న వైసీపీ పార్టీ కి ఓటు వేస్తే నే అది జరుగుతుందని..మళ్లీ చంద్రబాబు కనుక అధికారంలోకి వస్తే ఇంకా అయిపోయినట్లే అని పేదవాడి బ్రతికె రోజులు పోతాయని పేర్కొన్నారు.


గత ఎన్నికలలో అబద్ధాలు మోసాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దాదాపు అందరినీ మోసం చేశారని ముఖ్యంగా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విషయంలో తన విద్యాసంస్థలతోపాటు రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులను దారుణంగా మోసం చేశారని మోహన్ బాబు పేర్కొన్నారు.


చంద్రబాబు రాజకీయ జీవితం ముందునుండి మోసం, దగా, కుళ్ళు, కుతంత్రాల తో కూడుకున్నదని విమర్శించారు. తెలంగాణలో నూకలు చెల్లిపోయిన టీడీపీ పార్టీకి...ఆంధ్రాలో కూడా ఇక నో మోర్ అని టీడీపీ సీన్ అయిపోయిందని ...జగన్ అద్భుతమైన రాజకీయాన్ని చేశారని ముందునుండి న్యాయం వైపు సత్యం వైపు నిలబడిన జగన్ కచ్చితంగా ఎన్నికలలో ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు మోహన్ బాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: