తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారిన ఎపిసోడ్ లక్ష్మీ' స్ ఎన్టీఆర్ మూవీ. ఆంధ్రలో ఎలక్షన్స్ కారణంగా నిలిపివేశారు. అయితే తెలంగాణ లో విజయవంతం గా ఈ సినిమా ప్రదర్శింపబడుతోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యు లో అసలు ఈ సినిమా తీయడానికి కారణం బాలకృష్ణ గారే అంటూ పెద్ద బాంబ్ పేల్చారు. తన సినిమా ప్రమోషన్ల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటడులే అని అంత అనుకున్నారు. 

అయితే సినిమా మొదలు లో బాలకృష్ణ కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన ఇవ్వడం అనే విషయం అందరికి ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆయన చెప్పిన ఇంటర్వ్యు లో రెండేళ్ల కిందట కథానాయకుడు సినిమా దర్శకత్వం చేయమని బాలకృష్ణ తనను కలిసాడంట. కానీ అందులో లక్ష్మి పాత్ర లేకుండా నేను సినిమా తీయలేను అని చెప్పేసరికి వర్మ ను కాదని వేరే దర్శకుడిని వేస్తున్నరంట బాలకృష్ణ.అలా తను వచ్చి కలవడం వల్లే నాకు  లక్ష్మీ' స్ ఎన్టీఆర్ మూవీ తీయాలనే ఆలోచన వచ్చింది అంటున్నాడు వర్మ.

అప్పటి నుంచి కథ లో ను సమాచారం కోసం వేటకి బయల్దేరారు వర్మ. అయితే ఆయన కు వెళ్లే కొద్దీ ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి అంట. దీనితో ఎలాగైనా ఈ సినిమా తీయాలని పట్టుబట్టారు వర్మ. తెలుగు రాష్ట్రాల్లో నే మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ గారు అంటు ఆయన పొగిడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: