తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఎన్నికల సమయంలో హద్దులు దాటి ప్రవర్తించారు. నడిరోడ్డుపై జనాలందరి మధ్య తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారు. వాళ్ళ ప్రాంతంలో త్రాగునీరు సమస్య ఉందని ప్రశ్నించిన ఒక మామూలు వ్యక్తిపై జేసీ తిట్ల దండకం మొదలు పెట్టారు.

మొదటినుండి కూడా ఈయన దుందుడుకు స్వభావంతో ఉండేవారు. ఇక ప్రచార సమయంలో ఇలాంటి విషయాలు జేసీ నుండి చాలా తరచుగా వస్తుంటాయి. ఈ సంఘటన శింగనమల నియోజకవర్గం లో ప్రచారంలో భాగంగా జరిగింది. ఈ సారి జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేయకుండా అతని కుమారుడు జేసీ పవన్ రెడ్డి అనంతపురం ఎంపీ గా బరిలో ఉన్నారు.

అయితే జేసీ తిట్ల దండకం చూసి ముందు మన తెలుగు తమ్ముళ్లు నోర్లు వెళ్ళబెట్టి ఆ తరువాత ప్రశ్నించిన సదరు వ్యక్తిని వైసీపీ కార్యకర్తలు ఉసిగొల్పి పంపించారని వాదిస్తున్నారు. జేసీ ఏమో త్రాగునీరు సమస్యపై పరిష్కారం అడిగిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు భరించలేని తిట్లు తిట్టి, నీకు మందు పోయించిన వారిని వెళ్లి అడుగు రా అని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: