వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారి చెల్లి వైఎస్ షర్మిల నేడు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న కొత్త పదాల గురించి ప్రస్తావించారు. ఆయన ఏదో విచిత్రంగా రోషం, పౌరుషం జగన్ మోహన్ రెడ్డికి లేవు అంటున్నారని, అసలు కాంగ్రెస్ లో ఓడిపోతే అల్లుడు కదా అని పిలిచి పార్టీలో ఎన్టీఆర్ గారు చేర్చుకున్న ఇతను రోషం గురించి మాట్లాడుతున్నాడు అని విమర్శించారు.

ఇటలీ దెయ్యం అని సోనియాని తిట్టిన బాబు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గరకు వెళ్ళి పొత్తు పెట్టుకున్నారని, ఈయనకు రోషం గురించి మాట్లాడే హక్కు ఉందా అని వైఎస్ షర్మిల ప్రజల్ని ప్రశ్నించారు. దానికి అందరూ ముక్తకంఠంతో "లేదు" అన్నారు కానీ అది వేరే విషయం అనుకోండి.

ఇకపోతే 2014 నుండి నాలుగు సంవత్సరాలు బీజేపీ తో పొత్తు పెట్టుకున్న ఈయనకు ఇలాంటి మాటలు తగవు అని ఆమె హెచ్చరించారు. హరికృష్ణ గారి శవం దగ్గర కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలి అని చూసిన బాబుకి ఇంగిత జ్ఞానం లోపించింది అని ఆమె అన్నారు. చివరికి గెలిచిన ప్రతీసారీ పొత్తులు పెట్టుకొని గెలిచిన చంద్రబాబు ఇలాంటి మాటలు ఎలా అంటున్నారు అని ఆమె చెప్పి, పిల్లి పిల్లే... పులి పులే అని సారాంశాన్ని ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: