గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మీడియా ప్రజలతో ముచ్చటిస్తూ, చంద్రబాబు గుడివాడ సభలో చేసిన అనుచిత వ్యాఖ్యల పైన తీవ్ర స్థాయిలో విరుచకుపడ్డారు. ఎన్టీఆర్ సొంత గడ్డ అయిన గుడివాడలో బాబు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక్కసారి కూడా బాగోగులు పట్టించుకోని బాబు ఇప్పుడు వచ్చి కొత్తగా హామీలు ఇస్తున్నారు అని తీవ్రంగా విమర్శించారు.

అసలు గుడివాడలో ఫోర్ వే వేయిస్తా అని బాబు చెప్పడం ఏమిటని ఆయన ఎద్దేవా వేశారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండే రోడ్డు రవాణా శాఖను ఈయన ఎలా చేతిలోకి తీసుకుంటాడు అని ప్రశ్నించి, బాబుకి పిచ్చి పట్టింది అని వ్యాఖ్యనించారు. పైగా రైల్వే డిపార్ట్మెంట్, ఫ్లై ఓవర్లు దేవినేని అవినాష్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత శాంక్షన్ చేయిస్తా అనడం ఏమిటని అసలు ఆయన మతి ఉండి మాట్లాడట్లేదని ఆయన అన్నారు.

ఇక పోతే గుడివాడలో మెడికల్ కాలేజీ ఆయనను ఎవరు అడిగారు అని ప్రశ్నించి, ముందు గుడివాడలో ఎంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో తెలుసుకోమన్నారు. చంద్రబాబు తనని హైదరాబాద్ లో ఉండి 3 నెలలకు వస్తున్నారని నిందించే ముందు ఈయన వ్యాపారాలు, ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉందో గుర్తు తెచ్చుకోమన్నారు. ఆయన ఏమి తన అబ్బ సొమ్ము గుడివాడకు ఇవ్వలేదని, ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఇలాంటి జోకర్ వేషాలు వేయడం మానుకోవాలని హితబోధ చేశారు కొడాలి నాని.


మరింత సమాచారం తెలుసుకోండి: