ఆంధ్ర రాష్ట్రంలో ఒకపక్క ఎన్నికల సీరియస్ గా జరుగుతుంటే మరోపక్క ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజలకు విసుగును మరియు నవ్వుని తెప్పిస్తున్నాయి అని అంటున్నారు.


ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ ప్రభుత్వం స్థాపిస్తుంది అని ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా కేవలం నాలుగు గోడలమధ్య మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పాల్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతున్నారు ఏపీ ప్రజానీకం. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన కెఎ పాల్ మాట్లాడుతూ..


రాష్ట్రంలో జగన్ అవినీతి పరుడని చంద్రబాబు టైం అయిపోయింది అని పవన్ కళ్యాణ్ కి ఏం మాట్లాడుతారో అతనికే తెలియదు అని కెఎ పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికాగా మారుస్తానని చెప్పడంతో అందరూ కే ఏ పాల్ చేస్తున్న వ్యాఖ్యలపై సీరియస్ అవుతున్నారు. కాలు బయటెట్టడు - రాష్ట్రం మొత్తం నాతోనే అంటాడు ... మాకేంటీ ఖర్మ అని ఆంధ్ర ప్రజలు విసుగు చెందుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: