ఆంధ్ర రాజకీయాలలో రాబోతున్న ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం పై అందరి దృష్టి సారించారు. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. దానికి కారణం టిడిపి అధినేత చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో పోటీ చేయడం. అయితే ఇక్కడ పోటీ ఒకసారి గమనిస్తే నారా లోకేష్ వర్సెస్ ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నట్టుగా ఉంది మొత్తంమీద చూసుకుంటే టీడీపీ వర్సెస్ వైసీపీ. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల ఓ ప్రముఖ సోషల్ మీడియా ఛానల్ ఆ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా స్పందనలు ఇద్దరు నేతల గురించి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు సంచలన విషయాలు తెలియజేశారు.


నారా లోకేష్ అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి వస్తే బాగుంటుంది అంటూ చాలామంది మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ అపాయింట్మెంట్ కావాలంటే దొరికే పరిస్థితి ఉండదని కాబట్టి లోకల్ నాయకుడు నియోజకవర్గంలో ప్రతి సమస్యపై అవగాహన ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిస్తేనే మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని మంగళగిరిలో మెజార్టీ ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.


ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత ఎన్నికలలో గెలిచి నియోజకవర్గంలో మంచి మంచి కార్యక్రమాలు చేశారని అతి తక్కువ రూపాయలకే భోజనం పెట్టారని మరియు కూరగాయలు కూడా అతి తక్కువ ధరలకే ఇచ్చారని ఏ అవినీతి మరక లేని నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటూ మంగళగిరి ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా మంగళగిరి నియోజకవర్గం గురించి ఆలోచించే విధానంలోనైనా రాజకీయ ఎత్తుగడల్లో నైనా ఆళ్ల రామకృష్ణా రెడ్డి ముందు లోకేష్ పనికిరాడు అంటూ పేర్కొంటున్నారు మంగళగిరి ప్రజలు.




మరింత సమాచారం తెలుసుకోండి: