టీడీపీ యామిని ఒక స్త్రీ అయిఉండి కూడా భరి తెగించి వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. ఇది వరకే పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పవన్ కు మల్లి పూలు నలపడం తప్ప ఏమొచ్చు అని వ్యాఖ్యానించడం తో అప్పుడు జనసేన శ్రేణులు భగ్గుమన్న సంగతి తెలిసిందే. అయితే తరువాత జగన్ తల్లి గారి అయిన విజయమ్మ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 


అయితే టీడీపీ యామిని వ్యాఖ్యల పట్ల వైసీపీ భగ్గుమంటున్న సంగతి తెలిసిందే . యామిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని లేని పక్షం లో ఆంధ్ర ప్రజలే తమకు తగిన బుద్ది చెబుతారని చెప్పారు. అయితే యామిని వ్యాఖ్యలు టీడీపీ అధి నాయకత్వం మేరకే వచ్చాయని అందరూ చెబుతున్నారు. ఎందుకంటే ఒక కులం మీద అదే కులం కు చెందిన నేతల చేత మాట్లాడించడం .. అలాగే మహిళల మీద మహిళల చేత వ్యాఖ్యలు చేయించడం చంద్రబాబుకు కొత్తేమి కాదని వైసీపీ శ్రేణులు కౌంటర్ లు కూడా ఇచ్చారు. 


అయితే యామిని సాధినేని శర్మ గురించి బ్రాహ్మణ సంఘాలు మాట్లాడినారు. ఆమె ఒక మహిళాగా అందరూ గౌరవిస్తారని పైగా ఆమె బ్రాహ్మణ మహిళా అన్న సంగతి,ఆమె చరిత్రను  మర్చిపోకూడదని చెప్పారు . టీడీపీ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేయడం లో దిట్ట. కాబట్టి యామిని గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే ఆమెకు ఆమె కులానికున్న గౌరవం ఉంటుందని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: