లక్ష్మి పార్వతీ .. అన్న గారి అయినా రామ రావు గారి సతీమణి. ఎన్టీఆర్ కు .. చంద్రబాబు చేసిన వెన్నుపాటు కు ప్రత్యక్ష సాక్షి. ఎన్నో సార్లు రామారావు కూడా లక్ష్మి పార్వతీ ను పొగుడుతూ మాట్లాడినాడు. అయితే ఇప్పడూ లక్ష్మి పార్వతి వైసీపీ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పడూ చంద్రబాబు కుటీలా రాజకీయాలను ఎండగడుతూనే ఉంది. 


అయితే కాకినాడ సభలో లక్ష్మి పార్వతి .. చంద్రబాబు దుమ్ము దులిపేసింది. పార్టీ నీది కాదు, జెండా నీది కాదు చివరికి గుర్తు కూడా నీది కాదు. నువ్వు దొంగ బెబ్బ తీసి పార్టీని హస్తగతం చేసుకుంటే .. జగన్ సింహం మాదిరిగా పెట్టి సింగిల్ గా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా బరిలోకి దిగుతున్నాడు. నీ లాగా కుట్రలు, కుతంత్రాలు చేయలేదు. ప్రజల్లో ఉండి పోరాడుతూనే ఉన్నాడు. 


నీ కొడుకుకు కనీసం మంగళగిరి పేరు పలకటం చేతకాదు కానీ అతన్ని సీఎం చేసి ప్రజల మీదకు వదలాలనుకుంటున్నావా అని విమర్శలు చేసింది. పది లక్షలు పెట్టి ఖర్చు చేసిన వాడికి మాట్లాడటం కూడా చేత కాలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుతూ లోకేష్ కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి 60 కోట్లు పెట్టి సర్టిఫికెట్ కొన్నారని కానీ దానిని చదవటం కూడా రాదని ఆమె వ్యాఖ్యానించింది. యువనేత అయినా జగన్ కావాలో .. 70 ఏళ్ల వయసు కలిగి ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని చంద్రబాబు కావాలో తేల్చుకోమని ప్రజలను అభ్యర్ధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: