ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ ఎన్నికల ప్రచారానికి ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్న క్రమంలో అలాగే సర్వే లు అన్ని నెక్స్ట్ ముఖ్యమంత్రి జగనేనని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తాజాగా చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.


2014 ఎన్నికల్లో ఆచరణ కాని అసాధ్యమైన హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో మరియు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చంద్రబాబు ప్రభుత్వం పై అతి తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనడం జరిగింది . ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు  ఒంటరిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు సభలకు కనీసం జనం కూడా రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఓటమి భయం నెలకొన్నట్లు ఆంధ్ర రాజకీయాల్లో టాక్.


ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే భార్య, కుమారుడు, మనవడితో గడుపుతానని కామెంట్లు చేయడంతో ...చంద్రబాబు కి ముందే తెలిసిపోయినట్లు ఉంది తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో ఓడిపోతుందని అంటున్నారు ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: