జనసేన పార్టీలో చేరిన పవన్ కళ్యాణ్ అన్నయ్య నరసాపురం నియోజకవర్గం నుండి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. మొన్నటివరకు జబర్దస్త్ కామెడీ షో లో మరియు సినిమా ఇండస్ట్రీ లో బిజీగా ఉన్న నాగబాబు తాజాగా నర్సాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున హామీలు ఇస్తూ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏవిధమైన మేలులు జరుగుతాయో వంటి విషయాలను తెలియ జేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.


అయితే మొన్నటి వరకు ఏపీ రాజకీయాలలో మరియు జనసేన పార్టీలో కనబడని నాగబాబు ఒక్కసారిగా నర్సాపురం నియోజకవర్గంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే చాలా మంది జనం బిత్తర పోతున్నట్లు టాక్.


ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ రాష్ట్రంలో చేసిన అవినీతి గురించి లేవనెత్తుతూ అనేక ప్రశ్నలు వేస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లి పోతున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ముఖ్యంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎన్నో త్యాగాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారని నిస్వార్ధంగా ప్రజా సేవ చేయటానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారని రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రిని చేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు.దీంతో మొన్నటివరకు జబర్దస్త్ షోలో కమెడియన్స్ కి మార్కులు ఇచ్చిన నాగబాబు...ఇప్పుడు మాట్లాడుతున్న తీరును చూసి నాగబాబు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అయిపోయారు గా అంటూ పశ్చిమ వాసులు కామెంట్ చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: