ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం యుద్ధవాతావరణం కనబడుతుంది ఎన్నికల ప్రచారం చూస్తుంటే. ముఖ్యంగా 2014 ఎన్నికల కంటే వస్తున్న రాబోతున్న ఎన్నికలలో గత ఎన్నికల మాదిరిగానే టిడిపి వైసిపి పార్టీల మధ్య డి అంటే డి అన్నట్టుగా నువ్వానేనా అన్నట్టుగా పోటీ ఉన్న క్రమంలో బెట్టింగ్ల పర్వం రాష్ట్రమంతటా కనబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ముఖ్యంగా సర్వేలలో వైసిపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ ముఖ్యమంత్రి అవటం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా తాము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అని ప్రకటనలు చేయడంతో ఏపీ రాష్ట్రంలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి.


ముఖ్యంగా ఎన్నికల ప్రచారం చూస్తే జగన్ పార్టీ వైసీపీ పార్టీ కి జనం నీరాజనం పడుతున్నారు మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా అడపాదడపా జనం వస్తున్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం ఓటరు యొక్క నాడీ బయట పడటం లేదు. అయితే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికల్లో సర్వేలు, బుకీలు మాత్రం వైసిపి పార్టీ విజయం సాధించడం ఖాయమని జగన్ ముఖ్యమంత్రి అవుతారు అని ఎక్కువగా బెట్టింగులు కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: