ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రముఖ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబం అంతా గత కొన్ని రోజులుగా రాష్ట్రం అంతటా తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అయితే ఈ సారి మరీ ముఖ్యంగా అతని సతీమణి వై ఎస్ భారతి కూడా ఈ సారి బాగా ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.

పులివెందులలో సింహాద్రిపురం లో ఎన్ టీవీ విలేఖరి ముఖాముఖి అడిగిన తరుణంలో ఆమె తాను ఇలా ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రజలకు చంద్రబాబు పాలనలో ఇళ్ళు, నీళ్ళు, రుణ మాఫీ సరిగ్గా అందలేదని ప్రజలు ఆమెతో తమ గోడు వెళ్లబోసుకున్నారు అని ఆమె తెలిపారు.

ఇక పోతే జగన్ మళ్లీ సీ.ఎం కావాలని వారు కోరుకున్నట్లు ఆమె తెలిపారు. గత పది ఏళ్లగా జగన్ ప్రజల కోసం పడుతున్న కష్టం తాను దగ్గర నుండి చూస్తున్నానని, ఇప్పుడు జనమంతా ఆయన తపన, ఆశయం తెలుసుకున్నారని, అందరూ రానున్న ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆమెతో తమ కోరికను తెలియజేసినట్లు చెప్పారు భారతి.


మరింత సమాచారం తెలుసుకోండి: