సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి అక్కడి సమస్యల పైన తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. అక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమమైన వసూళ్లు, మామూళ్లు, బెదిరింపుల గురించి తాను చాలా కాలం నుండి వింటున్నట్లు ఆయన తెలిపారు.

ఇక పోతే సత్తెనపల్లి లో సేఫ్ ఫార్మా సూటికాల్స్ పేరుతో నాసిరకమైన మందులు తయారు చేస్తూ వాటిని క్వాలిటీ లేవు అని తెలిసినా గవర్నమెంట్ దాని పంపిణీకి నోటీసులు జారీ చేయడం గురించి కూడా విన్నట్లు చెప్పాడు.

మెడికల్ షాపుల్లో ఈ నాసిరకమైన మందులను బలవంతంగా అమ్ముతున్నట్లు, లేదంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ లను పురమాయించి జనాలను బెదిరించడం నీచమైన ప్రభుత్వానికి తార్కాణం అని ఆయన అన్నారు. ఇదంతా ఇక్కడ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆధ్వర్యంలో జరుగుతుండడం చాలా సిగ్గుపడాల్సిన విషయం అని జగన్ నిప్పులు చెరిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: