రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ సహజమే, తాజాగా జనసేన లోక్ సభ అభ్యర్థి జెడి లక్షి నారాయణ, చంద్రబాబు కు కౌంటర్ ఇచ్చారు. కోర్ట్ పరిధిలో ఉన్న కేసులను రాజకీయంగా వాడుకోవల్సిన అవసరం తమకు లేదని చంద్రబాబు కు జవాబు ఇచ్చారు.ఒక రోడ్డు షో లో చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను తీవ్రస్థాయి లో విమర్శించారు. ఎన్నో అవినీతి కేసులను ఎదుర్కుంటున్న జగన్ తో తనను పోల్చడమేంటి అంటూ ఆయన పవన్ పై మండిపడ్డారు.

అలాగే ఒక అవినీతి పరుడైన జగన్ కు తనకు సమాన దూరమా అంటూ ఆయన ప్రశ్నించారు.నేరచరిత్ర కలిగిన వ్యక్తికి, నాకూ పోలికా అని ? పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు చంద్రబాబు. మీ పార్టీ లో మి పక్కనే ఎప్పుడు ఉండే లక్ష్మి నారాయణ గారే జగన్ పై కేసులు వేసి దర్యాప్తు చేశారు. జగన్ ను 11 నెలలు జైలు కు పంపించారు. ఇలా అన్ని తెలిసిన మీరు జగన్ తో ఎలా పోలుస్తారు అంటూ మండిపడ్డారు.

జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ విషయం పై చంద్రబాబు కు కౌంటర్ ఇచ్చారు. కోర్ట్ లో ఉన్న విషయాలను రాజకీయంగా మేము వాడుకోము అంటూ క్లారిటీ ఇచ్చారు. మాకు వాడుకొవల్సిన అవసరం కూడా లేదు అని మా మానిఫెస్టో చాలు అంటూ అన్నారు. అలాంటి రాజకీయాలు మీకు అలవాటు కానీ మాకు కాదు అంటూ చంద్రబాబు కు సున్నితంగా కౌంటర్ ఆటాక్ చేశారు జేడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: