ఎన్నికల ప్రచారంలో భాగంగా చోడవరం నియోజకవర్గంలో విజయమ్మ పర్యటన సందర్భంలో నియోజకవర్గానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు మిలటరీ నాయుడు గారి కుమారుడు ఎలక్షన్ ప్రచారంలో భారీ బహిరంగ సభలో ఆ నియోజకవర్గ సమస్యలు గురించి మాట్లాడుతూ మరియు రాజశేఖరరెడ్డి కుటుంబం గురించి అదేవిధంగా జగన్ ధైర్యం గురించి ప్రజల కోసం పోరాడుతున్న విధానం గురించి అద్భుతంగా ప్రసంగించారు.


మిలట్రీ నాయుడు కుమారుడు మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం నిరంతరం రాజకీయాల్లో పాటుపడే కుటుంబం వైయస్ కుటుంబం అని అన్నారు. రాజకీయాలలో ఒక్కడిపై అన్ని పార్టీలు కలిసి కుళ్లు కుతంత్రాలతో ఎన్ని సమస్యలు ఇబ్బందులు సృష్టించిన ప్రజల కోసం చిరునవ్వుతో వాటినన్నిటినీ జయిస్తూ ముందుకు సాగుతున్నారు మన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు.


అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న రాజకీయ నేతలు చేసిన అవినీతిని ఈ సభలో ఎండగట్టారు మిలటరీ నాయుడు గారి కొడుకు. అతి చిన్న వయసులోనే ప్రజలనుద్దేశించి ఈ యువకుడి చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ పార్టీని గెలిపించుకోవాలంటే ప్రజలకు పిలుపునిస్తారు జగన్ను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందని రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు సంతోషంగా బ్రతికే రోజులు వస్తాయని మిలటరీ నాయుడు కొడుకు ఈ సందర్భంగా తెలియజేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: