అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలు, రైతుల శ్రేయస్సు గురించి తపన పడేవారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. జిల్లాలోని మాడుగుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చీడికాడలో రోడ్‌షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. రైతుల ప్రాణాలంటే చంద్రబాబుకు ఎన్నడూ లెక్కలేదని విమర్శించారు.

గతంలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.అలాగే తను చనిపోయే చివరిలో కూడా ప్రజల శ్రేయస్సు కోరి రచ్చబండ కార్యక్రమనికి బయల్దేరారు అంటూ గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆరోజు వాతావరణం అనుకూలంగా లేదని వెళ్ళడం మంచిది కాదని వారించాను అంటూ విజయమ్మ బాధపడ్డారు.

అయితే తన బిడ్డ జగన్ సొంత కొడుకుల దగ్గరికి తీసుకొని ఆదరించారని, అందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ఆమె అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయేక జగన్ చేసిన ఓదార్పు యాత్రలో ప్రతి కుటుంబం జగన్ ను అక్కున్న చేర్చుకున్నారు అంటూ ఆమె గుర్తుచేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: