గతంలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.అలాగే తను చనిపోయే చివరిలో కూడా ప్రజల శ్రేయస్సు కోరి రచ్చబండ కార్యక్రమనికి బయల్దేరారు అంటూ గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆరోజు వాతావరణం అనుకూలంగా లేదని వెళ్ళడం మంచిది కాదని వారించాను అంటూ విజయమ్మ బాధపడ్డారు.
అయితే తన బిడ్డ జగన్ సొంత కొడుకుల దగ్గరికి తీసుకొని ఆదరించారని, అందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ఆమె అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయేక జగన్ చేసిన ఓదార్పు యాత్రలో ప్రతి కుటుంబం జగన్ ను అక్కున్న చేర్చుకున్నారు అంటూ ఆమె గుర్తుచేసుకున్నారు.