ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ వైసిపి పార్టీ అధినేత జగన్ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ దూకుడు గా వ్యవహరిస్తూ అధికార పార్టీ టిడిపి చుక్కలు చూపిస్తున్నారు.


ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గెలవడం ఖాయం అనే వార్తలు బలంగా వస్తున్న క్రమంలో చాలా మంది ప్రముఖులు మరియు ఇతర పార్టీలకు చెందిన నాయకులు అధికార పార్టీ టిడిపి పార్టీకి చెందిన నాయకులు కూడా వైసిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఎన్నికల ముందు.


ఇదిలా ఉండగా తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు వైసీపీ పార్టీ లోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వారు ఎవరు అనగా వైయస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసి తర్వాత తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారిన  సాయి ప్రతాప్ రెడ్డి మరొకరు మాజీ అమలాపురం పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందిన హర్ష కుమార్.


ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఈ ఇద్దరు నేతలు రాజీనామా కూడా చేశారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఈ ఇద్దరు నేతలకు ఇస్తానన్న టికెట్లు ఇవ్వకపోవడంతో చంద్రబాబు నమ్మించి మోసం చేయడంతో వైసీపీ పార్టీ లోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు సాయి ప్రతాప్ రెడ్డి మరియు హర్ష కుమార్.తాజాగా వీరిద్దరు వైసీపీ పార్టీ లోకి వస్తున్నారన్న వార్తలు రావడంతో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు డబుల్ షాక్ తగిలింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: