వైసిపి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారి భార్య వైఎస్ భారతి తన భర్త తరుపున పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో గడపగడపకు వెళ్తూ జగన్ ప్రకటించిన నవరత్నాలు గురించి మరియు వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చేయబోయే కార్యక్రమాల గురించి ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు వైయస్ భారతి.


ఈ సందర్భంగా జగన్ గురించి ఒక సభలో మాట్లాడుతూ వైయస్ జగన్ అనుకున్నది సాధించే వ్యక్తి అని తన తండ్రి రాష్ట్రంపై కన్నా కలలను నిజం చేసేందుకు వైయస్ జగన్ ఎంతగానో పోరాడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వైయస్ జగన్ తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని పోగొట్టుకున్న తరువాత ప్రజలనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని ఇందుమూలంగా నే 2014 ఎన్నికల్లో అబద్ధాలు ఏమీ చేయకుండా చేసిందే చేయగలిగినది హామీలు ఇచ్చారని రైతు రుణమాఫీ ఆ సమయంలో అసాధ్యం అని తెలిసి రైతులను మోసం చేయకుండా నిజాయితీగా రాజకీయాలు చేశారని పేర్కొన్నారు.


ఇంకా వైఎస్ భారతి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక టిడిపి రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకుందో ప్రజలను ఏవిధంగా మోసం చేసిందో ప్రతి ఒక్కరికి అర్థమైందని అయితే రాబోతున్న ఎన్నికల్లో మోసం చేసిన తెలుగుదేశం పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.


రాష్ట్రంలో పేదరికం లేకుండా జగన్ అద్భుతమైన పరిపాలన చేయగలడని రాబోతున్న ఎన్నికల్లో జగన్ ని గెలిపించాలని వైయస్ భారతి పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: