వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చంద్రమౌళిని గెలిపిస్తే మంత్రిని చేసి కుప్పం ప్రజలకు మేలు చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. 30 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఇందులో 14 ఏళ్లు సీఏంగా ఉండి కూడా కుప్పం ప్రజల సమస్యలు పట్టించుకోలదేని మండిపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని జగన్ కోరారు. గత 20 రోజులుగా చంద్రబాబు చేస్తున్న మోసాలు తారాస్థాయికి చేరాయి అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు తన పచ్చ మీడియా తో అసత్య కథనాలు నడిపిస్తున్నారని వాటన్నిటి నుంచి పోరాడుతున్నామని జగన్ అన్నారు.ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా.

బీసీకులానికి చెందిన ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళిని ఇక్కడి నుంచి నిలబెడుతున్నాను. అయనను గెలిపించండి. నా కేబినెట్‌లో మంత్రిగా పెట్టుకుని మీ అందరికి మేలు చేస్తాను. అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: