ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని జగన్ కోరారు. గత 20 రోజులుగా చంద్రబాబు చేస్తున్న మోసాలు తారాస్థాయికి చేరాయి అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు తన పచ్చ మీడియా తో అసత్య కథనాలు నడిపిస్తున్నారని వాటన్నిటి నుంచి పోరాడుతున్నామని జగన్ అన్నారు.ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా.
బీసీకులానికి చెందిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని ఇక్కడి నుంచి నిలబెడుతున్నాను. అయనను గెలిపించండి. నా కేబినెట్లో మంత్రిగా పెట్టుకుని మీ అందరికి మేలు చేస్తాను. అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.