వైసీపీ పార్టీలో చేరిన సినీ నటుడు మోహన్ బాబు చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యంగా చంద్రగిరి ప్రాంతంలో ఇటీవల ఎవరో విద్యాసంస్థలు పెట్టారు అంటూ మోహన్ బాబు పేరు ప్రస్తావన తేకుండా ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు అంత నికృష్టుడు భూమిమీద ఉండడని పేర్కొన్నారు మోహన్ బాబు.


చంద్రగిరి ప్రాంతంలో తన తండ్రి ఎంతో కష్టపడి పనిచేసి మమ్మల్ని నీతిగా పెంచారని అసలు నీకు ఇంత ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది అని చంద్రబాబు పై ప్రశ్నల వర్షం కురిపించారు మోహన్ బాబు. ఇంకా మోహన్ బాబు మాట్లాడుతూ...కులం పేరుతో చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఇటువంటి దారుణమైన వ్యవస్థని అమెరికాలో ఉన్న వారికి కూడా కుల గజ్జి అందిస్తున్నారని ఇంత దారుణమైన రాజకీయ నాయకుడు భూమిమీద ఉండడని పేర్కొన్నారు.


ముఖ్యంగా కెసిఆర్ అంటే మోహన్ బాబు కి మరియు జగన్ కి ఉచ్చ అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్లు వేసాడు మోహన్ బాబు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రి పెట్టా బేడా సర్దుకుని ఉచ్చ పోసుకుని హైదరాబాద్ నుండి అమరావతి కి వచ్చింది ఎవరో అంటూ చంద్రబాబుపై దారుణమైన కామెంట్లు చేశారు మోహన్ బాబు. రాజకీయాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని మొన్నటి వరకు నీపైన గౌరవం ఉందని కానీ నువ్వు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది అని ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు నీ చరిత్ర మొత్తం బయటపెడతా అని మోహన్ బాబు ..చంద్రబాబు గురించి మాట్లాడారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: